వేదాన్ని ఖండిస్తూ
వచ్చిన నాస్తిక దర్శనాలు
ఎంతో కాలం నుండి వేదాన్ని ఆచరించేవారు
ఉన్నట్లే, కొందరు వేదాన్ని
అంగీకరించని వారూ ఉండేవారు. వారికి కలిగిన జ్ఞానం ద్వారా విషయాలను తెలిపేవారు.
వారు తము గుర్తించిన జ్ఞానాన్ని తమ శిష్యులకు అందించేవారు. అట్లాంటి సంప్రదాయాలు
కూడా వేద సంప్రదాయానికి సమాంతరంగా సాగుతూ వచ్చేవి. వాటినే దర్శనాలు అని అంటారు.
ఇవన్నీ ఎప్పటినుండో ఉన్నాయి. ఒక్కోక్కరి
ఆలోచనా దోరణి. ఒక్కో కాలంలో కొందరు దర్శించి వెలికి తీసి చూపిస్తారు. అట్లాంటి
దర్శనాలలో కొన్ని నాస్తిక దర్శనాలు కూడా ఉన్నాయి. సిద్దాంతాలలోని ఆలోచన ధార
మంచికోసమే అయి ఉంటుంది, కానీ ఆచరణ ధారలో
తప్పు జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఆయా కాలాన్ని బట్టి ఒక్కో సిద్దాంతం వెలుగులోకి
వస్తుంది.
నాస్తిక దర్శనాలు ఆరు. చారువాక, జైన మరియూ నాలుగు బౌద్ద దర్శనాలు.
చారువాక దర్శనం:
అట్లాంటి దర్శనాలలో మొదటిది చారువాక
దర్శనం. 'చారు' అంటే అందమైన అని అర్థం. వాక్కు అంటే మాటలు. అంటే
అందమైన మాటలు అని అర్థం. అవి చూడటానికి అందరికి నచ్చేలా ఉంటాయి. ఒక కాలంలో
వేదాన్ని కేవలం కర్మ కాండల కోసమే వాడి, ప్రజలని మోసం చేసిన రోజులు కూడా ఉన్నాయి. వేదం అనేది లోక ప్రయోజనాల కోసం,
కానీ కొందరు తమ తమ స్వార్థానికోసం వాడటం
మొదలు పెట్టారు. ఇది మనం ఈనాడు కూడా అక్కడక్కడ చూడవచ్చు. భగవంతుని పేరిట ఆలయాల
నియమాలను మార్చేవారు ఉన్నారు, ఆలయాలను వ్యాపార
కేంద్రాలుగా మార్చేవారు ఉన్నారు. ఈ నాడు అందరి దేవతలను కలిపి దేవాలయాలు
కడుతున్నారు, ఏనాడైనా మన పురాతన
ఆలయాలు అట్లా కనిపిస్తాయా. వేదాలు ఉన్న దేవతలను వారిని ఆరాధించే పద్దతులు
తెలుపుతాయి. ఎవరెవరి జ్ఞాన స్థాయిని బట్టి వారు కోరిన దేవతలని వారు ఆరాధించేవారు
తప్ప స్వంత ప్రవృత్తులు చేర్చడం సబబు కాదు. మన పూర్వుల కంటే గొప్ప తెలివైన వారి
మని ఈ నాటి వారి అభిప్రాయం. వారి జ్ఞానంలో ఎంత పాటి జ్ఞానం కలవారు వీరు ఒక్కసారి
ఆలోచించాలి. అట్లా వైదిక సంప్రదాయాలు తప్పు దారిన నడిచే సమయంలో బృహస్పతి అనే ఋషి
చారువాక దర్శనాన్ని అందించాడు. ఇది నాస్తిక దర్శనం. వైదిక ధర్మంలో మరణించినవారికి
కర్మలు అనేవి చేస్తుంటారు. అట్లా చేస్తే అవి వారికి అందుతాయా అని వారికి తోచిన
తర్కాన్ని చెబుతే, అది మనకు శ్రమ
తగ్గించేవిలా ఉంటాయి. అట్లాంటి అందంగా అనిపించే మాటలే చారువాక అంటే. అయితే వారి
దృష్టి వేదం వరకు ఉండదు, కేవలం ప్రత్యక్ష
ప్రమాణం, అంటే కనిపించిన
దాన్నే నమ్ముతారు. ఎప్పుడైతే వైదిక ధర్మం పూర్తిగా తప్పు దారి నడిచినప్పుడు ఇది
అవసరమైంది.
జైన దర్శనం:
కేవలం కనిపించే దాన్నే మాత్రం కాదు నమ్మడం,
ఆత్మ అనేదాన్ని కూడా నమ్మాలి అని చెప్పేది
జైన దర్శనం. మహావీర్ జైన్ అనే మహానుభావుడు ఈ దర్శనాన్ని అందించాడు. ఆత్మ ఈ శరీరంలో
చిక్కి ఉంటుంది కనుకనే శరీరం పని చేస్తుంది, అది వదిలి పెట్టాక పైకి గతి సాగిస్తుంది అని ఈ
దర్శనం చెబుతుంది. కనిపించని దాన్ని కొంత వరకు అంగీకరిస్తుంది ఈ దర్శనం.
No comments:
Post a Comment